వరద నీటిలో చిక్కుకున్న ట్రైన్...బోగీల్లోకి నీరు...ప్రయాణికుల్లో టెన్షన్
ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. రాయగఢ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి భువనేశ్వర్-జగ్దల్పూర్ హీరాఖుండ్ ఎక్స్ప్రెస్ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. రైలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ట్రైన్ బోగీలోకి నీరు వచ్చి చేరింది. వరద నీటిలో ట్రైన్ చిక్కుకుపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి తగ్గాక ట్రైన్ కదిలే అవకాశం ఉంది.