మ‌ళ్లీ కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే.. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్‌ రిపోర్ట్‌

Update: 2018-12-07 12:35 GMT

టైమ్స్ నౌ ఎగ్జిట్ స‌ర్వే .. పింక్ పార్టీకే ప‌ట్టం క‌ట్టింది. అసెంబ్లీని ర‌ద్దు చేసి ప్ర‌జాతీర్పుకు వెళ్లిన కేసీఆర్‌కే జ‌నం జేజేలు కొట్టార‌ని ఆ ఛాన‌ల్ పేర్కొన్న‌ది. టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌ 66, కాంగ్రెస్‌ 37, బీజేపీ 7, ఎంఐఎం 7, ఇతరులు 2...తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మరోపక్క రాజస్థాన్‌లో 200 శాసనసభా నియోజకవర్గాలకు గానూ 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

Similar News