ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ రజత్ కుమార్. నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికార పార్టీ నాయకులపై కూడా ఫిర్యాదు వస్తే కేసులు పెడుతున్నామని తెలిపారు. పోలింగ్ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తారని తెలిపారు. సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని అన్నారు. సుందరయ్య విజ్నాన కేంద్రంలో రజత్ కుమార్ మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు.