విశాఖకు కేసీఆర్ పయనం

Update: 2018-12-23 04:27 GMT


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు విశాఖకు వెళ్తున్నారు. ఆధ్యాత్మిక పర్యటన అంటూనే ఆంధ్రాలో అడుగుపెడుతున్నారు. ఇంతకీ కేసీఆర్ పర్యటన ఎలాంటి సంచలనాలకు దారితీయబోతోంది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న కేసీఆర్‌ విశాఖ టూర్‌లో రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వనున్నారు. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది.  నేడు 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి పగలు 12 గంటలకు విశాఖ శారదాపీఠం చేరుకుంటారు. అక్కడ స్వామిజీ ఆశీర్వచనాలు తీసుకుని రాజశ్యామల ఆలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి శారదా పీఠంలోనే భోజనం చేసిన తర్వాత ఒడిశా పర్యటనకు వెళ్లనున్నారు.

Similar News