ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌

Update: 2018-09-06 09:07 GMT

అసెంబ్లీ రద్దుపై కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు కేసీఆర్‌ అందించారు. కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు. ఇక.. అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్‌ కార్యాలయం పంపించింది. ఎన్నికలపై  కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం.

Similar News