తెలంగాణ బీజేపీకి నేతల సెగ రాజుకుంది. స్థానికేతరులకు సీట్లు కేటాయించవద్దని శేరిలింగంపల్లికి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర అసమ్మతి నేతలు నిరసన చేపట్టారు. శేరిలింగంపల్లి బీజేపీ టిక్కెట్ యోగనంద్ కు కేటాయించారని ప్రచారం జరగడంతో ఆ సీటు తనకే కేటాయించాలని బీజేపీ అధికార ప్రతినిధి నరేష్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు.