దారుణం...విద్యార్ధిని గొంతు కోసిన హిందీపండిట్‌

Update: 2018-11-03 06:35 GMT

కర్నూలులో దారుణం జరిగింది. బంగారుపేటలో బాలికపై ప్రేమోన్మాది దాడి చేశాడు. రాక్‌వుడ్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోన్న విద్యార్ధినిపై అదే పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న శంకర్ దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం తాను కూడా కత్తితో గొంతు కోసుకున్నాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు శంకర్‌‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్ధినిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు శంకర్‌ కూడా గొంతు కోసుకోవడంతో అతడ్ని కూడా హాస్పిటల్‌కి తరలించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో కొంతకాలంగా విద్యార్ధినిని శంకర్‌ వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే మద్యం మత్తులో నిందితుడు‌ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Similar News