ఆ ఇద్దరు సీనియర్లు టీడీపీని వీడనున్నారా..!!

Update: 2018-05-24 08:39 GMT

మహానాడు వేళ టీటీడీపీకి  ఊహించిన షాక్‌లు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.  తెలంగాణ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతగా గుర్తింపు పొందిన మొత్కుపల్లి నరసింహులు  పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఆయన ... మహానాడుకు హాజరుకాలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ పదవి ఆశించి భంగపడిన మోత్కుపల్లి గతంలోనూ రాజీనామా చేస్తారంటూ వార్తలు వినిపించాయి. అయితే మొత్కుపల్లితో పాటు మరో సీనియర్ నేత ఆర్‌ కృష్ణయ్య కూడా హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న ఆయన  ఉద్దేశపూర్వకంగానే మహానాడుకు హాజరు కాలేదని భావిస్తున్నారు.   

Similar News