సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్రావు హర్షంవ్యక్తంచేశారు.