నారాయణ విద్యాసంస్థల నిర్లక్ష్యానికి మరో విద్యార్ధి బలయ్యాడు. శంషాబాద్ నారాయణ క్యాంపస్లో కరెంట్ షాక్ కొట్టి ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి ఖాసిమ్ మృత్యువాతపడ్డాడు. మంచినీళ్లు పట్టుకుంటుండగా కరెంట్ షాక్ కొట్టిందని విద్యార్ధులు చెబుతున్నారు. విద్యార్థి మంచినీళ్లు తాగేందుకు వెళ్లాడు. అయితే పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు. కళాశాల యాజమాన్యం విద్యార్థిని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే కాషీఫ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పడంతో, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. నిర్లక్షంగా వ్యవహరించి విద్యార్థి మృతికి కారణమైన కాలేజ్ మేనేజ్మెంట్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.