శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఆమె భౌతికకాయంతో బోనీ కపూర్, ఇతర కుటుంబీకులు దుబాయ్ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో ఇతర ప్రక్రియలు పూర్తైన అనంతరం విమానం బయలుదేరుతుంది. ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో భౌతికకాయాన్ని ముంబయికి తరలించనున్నారు. రాత్రి 9 గంటల తర్వాత శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటల వరకు.. శ్రీదేవి స్వగృహం భాగ్యబంగ్లాలో ఆమె భౌతికకాయాన్ని ఉంచనున్నారు.