కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ఐటీ దాడుల నేపధ్యంలో ఓటుకు నోటు కేసు మరో సారి తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డితో పాటు బంధువుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్న ఐటీ, ఈడీ అధికారులు ... తాజాగా ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు సెబాస్టియస్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మోతీనగర్లోని స్వస్తిక్ కాంప్లెక్స్లో ఐటీ అధికారులు తనఖీలు చేపట్టారు. డోర్స్ లాక్ చేసి సెబాస్టియన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.