తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలోని మామందూరు రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఎదురుగా వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణీకులను గ్యాస్ కటర్ల సాయంతో బయటకు తీసిన పోలీసులు ఆసుపత్రులకు తరలించారు.