పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీ కొన్న బైకర్‌

Update: 2017-12-26 06:07 GMT

అతి వేగం మరొకరి ప్రాణం తీసింది. మద్యం సేవించి వాహనం నడపవద్దని హెచ్చరించిన యువత మారడం లేదు. పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు స్వల్ప గాయాలతో బటటపడ్డారు. సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన అనీష్‌ భార్గవ్ స్నేహితుడు వంశీతో కలిసి బంజారాహిల్స్‌ వైపు బైక్‌పై బయలుదేరాడు. స్పోర్ట్స్‌ బైక్‌పై వేగంగా వెళ్తూ పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పైన ఉన్న డివైడర్‌ను ఢీ కొన్నాడు. ప్రమాదంలో అనీష్‌ భార్గవ్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు వంశీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Similar News