తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నయో తెలపాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరిచే నిమిత్తం ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తనను టార్గెట్ చేస్తూ పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్ ను చేర్చారు. కాగా రేవంత్ రెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల(నవంబరు) 6కు వాయిదా వేసింది.