దేశ రాజధానిలోని ప్రముఖ వారసత్వ కట్టడమైన ఎర్ర కోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ గ్రూపు స్వీకరించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఎంఓయూపై దాల్మియా భారత్ లిమిటెడ్, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంతకాలు చేశాయి. ఎర్రకోట నిర్వహణలో భాగంగా దానికి మరింత సొబగులు అద్దేందుకు త్రీడీ లైట్ అండ్ సౌండ్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లో ఇది పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం చేసిన ట్రయల్ రన్ వీడియో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.