భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్కు కేంద్ర సమాచార కమిషన్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసినవారి జాబితాను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆర్బీఐ ఉల్లంఘించిందని, దీనికి కారణాలను తెలియజేయాలని ఆదేశించింది. 50 కోట్ల రూపాయలకు మించి బ్యాంకు రుణాలను తీసుకుని, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినవారి జాబితాను వెల్లడించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, దీనిని అమలు చేస్తూ, ఆ వివరాలను వెల్లడించడానికి నిరాకరించినందుకు గరిష్ఠ జరిమానాను ఎందుకు విధించరాదో తెలియజేయాలని ఉర్జిత్ పటేల్ను సీఐసీ కోరింది.