కాపాడాల్సిన రక్షకుడే ఓ మహిళపై కాటేశాడు. అవును పోలీసే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసు ఠాణాలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి వచ్చిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. ఇటివల మహిళపై అత్యాచారానికి చేసిన దుండగుడిపై ఫిర్యాదు మేరకు స్నేహితుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెన్నక్కితిసుకోవడానికి వచ్చిన మహిళపై పోలీసు అత్యాచారం చేశారని బివాండిలోని కొంవాగ్ పోలీసులు తెలిపారు.
తన స్నెహితుడిని విడుదల చేయలంటే రాజ్నోలీ బైపాస్ రోడ్డులో తనని కలవాలని ఎస్సై అడిగాడు. ఎస్సై మాటప్రకారం అక్కడి వెళ్లిన ఆమెను కల్యాణ్ టౌన్లోని గెస్ట్హౌజ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధిత మహిళ తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు వివరించారు. ఎస్సై రోహన్ గొంజారీపై కేసు నమోదు చేశామని, అతడిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. కొంగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సైపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కేసు దర్యాప్తులో ఉందని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.