రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారు. సవాయి మధోపూర్లోని దుబి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెలికితీసి, సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ స్టీరింగ్ను అదపు చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.