మోడీని రావణాసురుడితో పోల్చుతూ....

Update: 2018-01-15 11:27 GMT

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ....అమేథి పర్యటనలో వివాదం రాజుకుంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా....కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీలో రాహుల్ గాంధీని కృష్ణుడితో పోల్చారు. మరో చోట ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని రావాణాసురుడితో పోల్చిన కాంగ్రెస్‌ నేతలు....రావణాసురుడ్ని రాహుల్ గాంధీ గన్‌తో కాల్చుతున్న పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయ్. ఈ పోస్టర్‌ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య గొడవకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయ్. పోలీసులు రంగప్రవేశం చేసి...ఇరు వర్గాలను చెదరగొట్టాయ్.

Similar News