ఇవాళ కారు జోరు ఉండొచ్చు.. రేపు రిపేర్ కావొచ్చు: పొన్నం

Update: 2018-12-15 09:38 GMT


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో క్యాడర్ అధైర్యపడొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎప్పడైనా ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని అందుకు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా దిగులు చెందోద్దని ప్రభాకర్ అన్నారు. నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ కారు జోరు ఉండొచ్చని రేపు రిపేర్ కావొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ తోకపార్టీ అని మండిపడ్డారు. 105 మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేశారు.  

Similar News