ఢిల్లీ వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య

Update: 2018-11-13 04:48 GMT

మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ బాట పట్టారు. తొలి జాబితాలో తనకు చోటు దక్కకపోవడంతో  చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన  జనగామ నియోజకవర్గాన్ని కూటమి పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించినట్టు వార్తలు రావడంతో లాబీయింగ్‌ మొదలు పెట్టారు. అధిష్టానంలో తనకు పరిచయం ఉన్న నేతల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. అయితే జనగాం బదులు మరో చోటు పోటీ చేయాలంటూ అధిష్టానం కోరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకున్నానని  ఇలాంటి దశలో తనకు కాకుండా మరోకరికి టికెట్ ఇవ్వడం సరికాదంటూ పొన్నాల చెప్పినట్టు సమాచారం. 

Similar News