ఆ 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Update: 2018-12-07 10:45 GMT

తెలంగాణలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించనున్నారు. నక్సల్స్‌ ప్రభావిత 13 నియోజవకవర్గాలు సిర్పూర్, చెన్నూర్(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఎల్లందు (ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ)ల ఓ గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాలకు మరో గంట సమయం ఉంది. 

Similar News