మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

Update: 2018-10-02 04:36 GMT

 మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి కోవింద్‌,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కాంగ్రెస్‌నేత సోనియా గాంధీలు మహాత్ముడికి పుష్ప నివాళి అర్పించారు. దేశానికి జాతిపిత చేసిన సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గాంధీజీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిని ఆలోచింపజేశాయన్నారు. 

Similar News