హుజుర్నగర్లో ఓ పోలింగ్ అధికారిని స్థానికులు చితకబాదారు. ఓ దివ్యాంగుడు ఓ గుర్తుకు ఓటేయమంటే.. ఆ అధికారి మరో గుర్తుకు ఓటేసారు. అనుమానం రావడంతో ఆ వికలాంగుడు వీవీ ప్యాట్ స్లిప్ను చెక్చేసాడు. వేరే గుర్తుకు ఓటు వేసాడని స్పష్టం కావడంతో ఆ అధికారిపై స్థానికులు దాడి చేశారు. కొందరు అధికారులు వృద్ధులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓటు ఎలా వేయాలో చెబుతామని చెప్పి వారి బదులు అధికారులే వారికి నచ్చన ఓటు వేస్తున్నారు.