తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నవరంలోని సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఆలయాధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. పవన్ వెంట మాజీ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.