చలోరే...చలోరే చల్’ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేనాధిపతి పవన్ కల్యాణ్కు ఖమ్మం విద్యార్ధిని శ్రీజ ఆల్ ద బెస్ట్ చెప్పింది. పవన్ కల్యాణ్ ఆశీస్సులతో మూడేళ్ల క్రితం కేన్సర్ నుంచి బయటపడిన శ్రీజ ఈరోజు కొత్తగూడెం వచ్చి పవన్ కల్యాణ్ను కలిసింది. రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీజ ఆకాంక్షించగా శ్రీజ ఆరోగ్యంగా ఉండటం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు పవన్. శ్రీజ కోరిక మేరకు మూడేళ్ల క్రితం ఖమ్మం వెళ్లి స్వయంగా ఆమెను పరామర్శించారు. శ్రీజ కోలుకున్న తర్వాత కూడా ఆమె యోగక్షేమాలు గురించి ఎప్పటికప్పడు తెలుసుకున్నారు. అంతేకాదు శ్రీజతోపాటు ఆమె తల్లిదండ్రులను హైదరాబాద్ రప్పించుకుని మాట్లాడారు.