జనసేన అధినేత పవన్ కల్యాణ్ను...పోలాండ్ దౌత్త ఆడమ్ బురాకోవస్కీ, మరో 20 మంది విద్యార్థులు ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కలిశారు. పవన్ దంపతులు పోలాండ్ బృందానికి సాధర స్వాగతం పలికారు. గతంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ కొందరు పోలాండ్ వాసులతో భేటీ అయ్యారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్న ఆడమ్ పవన్ను కలిసేందుకు ఆసక్తి చూపారు. ఇవాళ జనసేన పార్టీ కార్యాలయంలో ఆడమ్తో పాటు 20 మంది పోలాండ్ విద్యార్థులు పవన్ను కలిసారు.