కొండ‌గ‌ట్టు అభివృద్ధి కోసం రూ.11ల‌క్ష‌ల విరాళం

Update: 2018-01-22 09:55 GMT

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టులో కొలువుదీరిన ఆంజనేయస్వామిని దర్శించుకుని..ఆలయంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ ఆలయ అభివృద్ధి కోసం రూ.11 లక్షల విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. కాగా, ఆలయ మర్యాదలతో పవన్ కల్యాణ్ కు పండితులు స్వాగతం పలికారు. అనంతరం  పవన్ కల్యాణ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. స్వామి తనను చల్లగా చూడాలని మొక్కుకున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. స్వామి ఆశీస్సులతోనే తాను 2009లో ప్రమాదం నుంచి బయటపడినట్టు పేర్కొన్నారు.

Similar News