మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు పద్మవిభూషన్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇళయరాజకు అభినందలు తెలిపారు. మహానటి సావిత్రికి కూడా పద్మఅవార్డు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఎస్వీ రంగారావు, సావిత్రికి పద్మఅవార్డు ఇప్పించేలా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు.