నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఎమ్మెల్యే కాకాణి వివాదం తారా స్ధాయికి చేరింది. కలెక్టర్తో కాకాణి వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉద్యోగులు సామూహిక సెలవులో వెళ్లారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. గత వారం రోజులుగా చోటు చేసుకున్న ఘటనలను తెలియజేస్తూ కలెక్టర్ ముత్యాలరాజు సమగ్ర నివేదకను సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. ఉద్యోగుల, కుల సంఘాలను రెచ్చగొట్టి తనపై ఆరోపణలు చేయిస్తున్నారంటూ విమర్శించారు.