ముంబైలో రెచ్చిపోయిన యువత...సెల్పీలు దిగేందుకు రన్నింగ్ ట్రైన్లో స్టంట్స్
ముంబయి లో పోకిరీలు రెచ్చిపోయారు. వేగంగా వెళ్తున్న లోకల్ ట్రైన్లో డేంజర్ స్టంట్స్ చేశారు. పైగా సెల్ఫోన్లో రికార్డు చేసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. యువకులు చేసిన విన్యాసాలు చూసి తోటి ప్రయాణీకులు హడలిపోయారు. ఫ్రెండ్స్ మధ్య పోటీ బెట్టింగ్ పెట్టుకుని కదులుతున్న ట్రైన్లలో డేంజర్ స్టంట్స్ చేసి కెమెరాకు చిక్కాడు. గతంలో ఇలాంటి సాహసాలు చేసి కోందరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్న రైల్వే పోలీసులు పట్టించుకోకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం యువకులు చేసిన స్టంట్స్ వీడియో వైరల్గా మారింది.