రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన కుమార్తె ఇషా పెళ్లి శుభలేఖలను పంచడంలో బిజీగా మారారు. కుటుంబ సమేతంగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన ఆయన... తొలి శుభలేఖను స్వామివారి పాదాల ముందు ఉంచారు. భారీ సెక్యూరిటీ మధ్య తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీలతో దేవాలయానికి వచ్చిన ముఖేష్ కు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆపై స్వామికి ప్రత్యేక పూజలు జరిపించిన ముఖేష్, శుభలేఖను స్వామికి సమర్పించారు.