రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ కలకలం రేపింది. కేశంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాజీదా ఫాంహౌస్పై పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఫాంహౌస్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 11 మంది యువకులు, 5 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 22వేల 240 నగదు, రెండు కార్లు, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. యువకులది హైదరాబాద్లోని పాతబస్తీ, యువతులు ముంబైకి చెందిన వారిగా గుర్తించారు.