ఎన్టీఆర్‌ తలుచుకుంటూ మోత్కుపల్లి కన్నీరు

Update: 2018-05-28 06:24 GMT

టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కన్నీరు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చిన ఆ‍యన అన్నగారికి తలుచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. కొందరు నేతల కుట్రలకు ఎన్టీఆర్ బలయ్యారంటూ మోత్కుపల్లి ఆరోపించారు. ఎన్టీఆర్ పేరును  రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించిన  ఆయన ... ఎన్టీఆర్‌తో చివరి వరకు తానే ఉన్నానన్నారు. చంద్రబాబులో మార్పు వస్తుందని ఇప్పటి వరకు భావించానని ... అది సాధ్యం కాదని తెలుసుకున్నానని అన్నారు. 

Similar News