బీదర్ ఎంపీ మల్లికార్జున ఖర్గేని టార్గెట్ చేస్తూ ప్రధాని ప్రసంగం కొనసాగింది. మోడీ మాట్లాడటానికి కొద్ది నిమిషాల ముందు ఖర్గే ప్రసంగించారు. ఆ తర్వాత అందుకున్న ప్రధాని... ఖర్గే మాట్లాడుతుంటే వీడ్కోలు ప్రసంగంలా అనిపించిందంటూ చురకలంటించారు. కర్నాటక ఎన్నికల తర్వాత ఖర్గే కథ ఖతమంటూ కౌంటరిచ్చారు మోడీ.