కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని, టీటీడీపీకి లీడర్ లేరని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ నేత కేటీఆర్. సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. కరువు కోరల్లో ఉన్న సిరిసిల్లను మూడేళ్లలో అభివృద్ధిలోకి తెచ్చామని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సిరిసిల్లను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని ఆయన అన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లేనని కేటీఆర్ చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయని, కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యమంటున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కేటీఆర్ అన్నారు.