ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు. కేంద్రం సహాకారంతో కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని మరో 10 క్లస్టర్లు మంజూరు చేయాలని జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానిని కోరినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. 12వందల కోట్లతో నేతన్నకు చేయుత ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టామన్న ఆయన 8వేల మగ్గాలను ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామన్న కేటీఆర్ కస్టర్సన్ని చేనేతలను ఆదుకునే విధంగా ఉంటాయన్నారు.