జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠత్మకంగా ఏర్పాటుచేసిన జనసేన పార్టీపై మరోసారి విరుచుకపడ్డారు టీడీపీ మంత్రి జవహర్. జనసేన పార్టీ కార్యాలయం చూడటానికి గంగిరెద్దుల హడావుడి కనిపిస్తోందని మండిపడ్డారు. ఇన్ని దినాలు ఎం పని పాటలేక ఖాళీగా ఉండి ఇప్పుడు ఎక్కడ తలదాచుకోవాళ్లో తెలియని నేతలు జనసేన పడవలోకి వెళ్లున్నారని ఎద్దేవా చేశారు. అయితే నేడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన రావెల కిషోర్ బాబు చేరిన సందర్భంగా మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజారాజ్యం స్థాపించిన రోజు నుంచే చిరంజీవి కుటుంబం చుట్టూ బొంగురంలా తిరుగుతున్నారని ఆరోపించారు. రావెల మంత్రిగా ఉండి మాదిగల సంక్షేమానికి ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు.