ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లకు గుంతలు ఏర్పడ్డాయ్. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కూకట్పల్లిలో గుంతలున్న చోట ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫోటోలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గుంతలు వెంటనే పూడ్చి వేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.