హడావుడికి తక్కువేం ఉండదు హంగామాకు కొదువే కనిపించదు చుట్టూ ఎవరూ లేకున్నా పర్ఫార్మెన్స్ లో మాత్రం ఫస్ట్ క్లాస్ కొట్టేస్తారు. ప్రజల్లోకి వెళ్లే సమయంలో తమ బలం, బలగం చూపించే వేదికగా ఎన్నికలనుకునే నాయకులు మనదేశంలో చాలామందే ఉన్నారు. కనీసం ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లెలా అడగాలో కూడా తెలియని లీడర్లు అడుగడుగునా కనిపిస్తారు. అలా ప్రజలను ఓట్లడిగే సమయంలో బాడీగార్డులతో వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న మెదక్ బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఓ 10 మంది కూడా లేకుండా చుట్టూ బౌన్సర్లతో ప్రచారం నిర్వహిస్తున్న ఈయన పేరు ఆకుల రాజయ్య. బాడీ బిల్డర్లు, బడా లీడర్లతో ఈయన గారి ప్రచారం చూస్తేనే హడలెత్తుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజయ్య స్థానికేతరుడు కావడంతో స్థానిక నాయకుల నుంచి అంతగా సహకారం అందట్లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక కొందరు మహిళలకు జెండాలు అప్పగించినా వారితో కలిసి ప్రచారం చేయట్లేదు. బౌన్సర్ల మధ్యలోనే ఉంటూ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.