తెలంగాణలో ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ జనసమితి అవకాశవాద రాజకీయాలను నిరసించాలని, కులవివక్ష, అస్పృశ్యత, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని, ఆదివాసీల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడాలని, తదితర అంశాలపై ఆ లేఖలో పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.