ఐటీ నోటీసులు విజయవాడలో ఓ వ్యాపారి ప్రాణాలు తీశాయి. ఆటోనగర్ లో లారీ బాడీబిల్డింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్న సాధిక్ కు పన్ను చెల్లించాలని ఇటీవల ఐటీ అధికారుల నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న సాదిక్ రెండు రోజుల క్రితం స్క్రూ బిడ్జి దగ్గర బందర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐటీ అధికారుల వేధింపులతో చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.