పెథాయ్ తుపాను : విజయవాడలో ఒకరు మృతి

Update: 2018-12-17 11:18 GMT


ఏపీని పెథాయ్ తుపానుతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పెథాయ్ ప్రభావంతో రాష్ట్రామంతటా చల్లనిగాలులు, ఈదురుగాలులు వీస్తున్నాయి, అక్కడక్కడ భారీ వర్షాలకు  కొండచరియలు విరిగిపడి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కాగా విజయవాడలోని సున్నపుబట్టిలు సెంటల్ వద్ద కొండచరియాలు విరిగి ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై పడ్డింది దింతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా ఈ ఘటనపై తాజాగా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం స్పందించారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 50వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే కలెక్టర్‌తో పాటు విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహ‍న్ రావు, రెవెన్యూ అధికారులు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి రూ. 50వేలు స‍హయం చేశారు.  
 

Similar News