మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. కొల్హాపూర్ దగ్గర మినీ బస్సు బోల్తాకొట్టింది. బ్రిడ్జి పైనుంచి పంచగంగ నదిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 13మంది మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గణపతిపూలే నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.