టీడీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ వార్నింగ్...

Update: 2018-02-07 07:27 GMT

ఎంత నచ్చజెపుతున్నా వినకుండా లోక్ సభలో నినాదాలు చేస్తూ పోడియం ముందు నిలబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఉద్దేశించి స్పీకర్ సుమిత్రా మహాజన్ చురకలంటించారు. విభజన హామీలను అమలు చేయాలంటూ గత రెండు రోజులుగా టీడీపీ సభ్యులు పార్లమెంటు బయట, లోపల ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా బుధవారం కూడా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ కోపగించుకున్నారు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని చురకలు వేశారు. అంతేగాక ఇలా అయితే ఇంట్లో పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టుకోలేరంటూ వ్యాఖ్యానించారు.

Similar News