టీఆర్ఎస్ పాలనంతా అక్రమాలపుట్టగా మారిందని సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ అన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ నాలుగున్నరేళ్ళకు కూడా మాట నిలబెట్టుకోలేదని తప్పు పట్టారు. కేసీఆర్కు అధికారం దక్కగానే ఆయనలో దుర్బుద్ధి ప్రారంభమై ఒక్క మంచి పనీ చేయలేదని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ భవన్కు వచ్చిన ఖుష్బూ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవకీ మేలు జరగలేదని ఖుష్బూ విమర్శించారు. రూ.300 కోట్లతో ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్కు సొంత కారులేదట! అని ఖుష్బూ ఆశ్చర్యంవ్యక్తం చేశారు. సచివాలయానికి కూడా రాకుండా ఫాంహౌస్లో ఉండే సీఎం కేసీఆర్ ఒక్కరేనని దుయ్యబట్టారు.