కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా తెలిపారు. పొత్తుల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చిందని చెప్పిన కుంతియా టీజేఎస్కు 8 సీట్లు కేటాయిచినట్టు వివరించారు. కొన్ని స్థానాల్లో మాత్రమే సందిగ్ధత ఉందని.. అది కూడా రేపటిలోగా క్లియర్ అవుతుందన్నారు. పొన్నాల సీటుపైనా కుంతియా క్లారిటీ ఇచ్చారు. పార్టీలో పొన్నాల సీనియర్ నాయకుడని సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పొత్తులు కొలిక్కి వచ్చాయని, కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. కూటమికి కన్వీనర్గా కోదండరామ్ ఉన్నందున టీజేఎస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని కుంతియా తెలిపారు.