మీడియాపై అలిగిన సీఎం.. ఎందుకో తెలుసా?

Update: 2018-11-23 11:16 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అప్పుడప్పడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తాలోకి వస్తుంటడు కాని ఇప్పడు ఏకంగా మీడియా ఛానల్స్ పై అలక బాట పట్టారు. దింతో కుమారస్వామి సంచలన నిర్ణయమే తీసుకున్నారు. మీడియా తను చేసిన చిన్న చిన్న తప్పులను బూతద్ధం పెట్టి సూపిస్తూ కావాలనే నామీద పగపెట్టుకొని నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, మీడియా కారణంగా నేను ఎన్నోసార్లు బాధపడ్డాను ఆరోపించారు. ఇటివల తనను పనికిరానోడు అని విమర్శించిన ఓ మహిళారైతు పట్ల కుమారస్వామి స్పందనను మీడియాలో మాత్రం తను కించపరుస్తూ మాట్లాడారంటూ కొన్ని చానల్స్‌లో ప్రసరించరని కుమారస్వామి కినుక వహించారు. ఇలా ప్రతి చిన్నదాన్ని కూడా మీడియా నానారకాలుగా చూపిస్తున్నరని మండిపడ్డారు. దింతో కుమారస్వామి మాట్లాడుతూ ఇకపై మీడియాకో దండం, మళ్లీ మీడియాకు నా మొఖం చూడనని శాపథం చేశారు. ఇది ఇలాఉంటే తాజాగా కుమారస్వామి వ్యాఖ్యలపై యడ్యూరప్ప దుయ్యబట్టరు. రాష్ట్ర సర్కార్ అన్ని విధలుగా విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చడానికే సిఎం కుమారస్వామి మొత్తం మీడియామీద నెట్టివెస్తున్నరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Similar News