తెలంగాణ ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో 46 సీట్లలో విజయం సాధించిన టీఆర్ఎస్ మరో 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఫలితంపై ప్రముఖులంతా సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు. తనను గెలిపించిన ప్రజానీకానికి రుణపడి ఉంటానని వెల్లడించారు. ‘‘మీకు సేవ చేసుకునేందుకు మాకు మరొక అవకాశాన్నిచ్చినందుకు, కేసీఆర్ గారిపై తెలంగాణ ప్రజలు నమ్మకముంచినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
Grateful, indebted & Humbled
— KTR (@KTRTRS) December 11, 2018
Thanks Telangana for keeping the faith in KCR Garu & giving us another opportunity to serve you pic.twitter.com/nSwnaLz8z2